-->
contact us to buy our latest gallery setting

Pesarattu movie shooting complete

నందు, నికిత నారాయన్ జంటగా , కత్తి మహేష్ దర్శకత్వం లో క్లాప్ బోర్డ్ స్టుడియో, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్, రిచెజ్జ మీడియా ఎంటర్ టైన్మెంట్స్, పింక్ పగిడి సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'పెసరట్టు'. ఈ సినిమా హైదరాబాద్ లోని గండిపేటలో ఇటివలే ప్రారంభమయి 30మంది నూతన నటీనటులతో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తిచేసుకుంది. అక్టోబర్ 1న మూవీ టీజర్ ను, అక్టోబర్ 11న రాజమండ్రి లో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఈడుపుగంటి శేషగిరి రావు తెలియజేసారు.

ఈ సినిమా టాలీవుడ్ లోనే తొలిసారిగా క్రౌడ్ ఫండింగ్ పద్దతిలో నిర్మాణం జరుపుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ.. ఫ్లో-కాం టెక్నాలజీ ని ఇన్స్పిరషన్ గా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది . హీరో, హీరోయిన్ మినహా 30మంది నటీనటులందరినీ సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా ఎంపిక చేసుకుని వారం రోజులు వారందరికీ వర్క షాప్ నిర్వహించారు. ఈ రోజు నుంచి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడం జరిగిందని దర్శకుడు మహేష్ కత్తి తెలిపారు. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.


నిర్మాతలు: శ్రీనివాస్ గునిసెట్టి, ఈడుపుగంటి శేషగిరి రావు, డీజీ సుకుమర్, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్, కెమెరా: కమలాకర్, లైన్-ప్రొడ్యూసర్ : డీ కే. విశ్వనాథ్, మాటలు: అరిపాల సత్య ప్రసాద్, పాటలు: సుభాష్, స్టైలీస్ట్: నిహారిక కన్నన్, కో-డైరెక్టర్: -పవిత్రం మీసాల, కథ-దర్శకత్వం : కత్తి మహేష్,’’